ఉప్పల్, మే 19: తెలంగాణ ఎంసెట్-2026లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన చిలుకనగర్ డివిజన్కు చెందిన మల్లాడి రుషిని కేటీఆర్ ఘనంగా అభినందించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ నివాసం నానక్రామ్గూడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రుషికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఎంసెట్ పరీక్షల్లో 156.63 మార్కులు సాధించి రాష్ట్రంలో తొలి ర్యాంక్ సాధించిన రుషి, కొండల్ రెడ్డి కుమార్తె. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని కేటీఆర్ కొనియాడారు. రుషి విజయం చిలుకనగర్ డివిజన్తో పాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని రుషి నిరూపించిందని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరియు విద్యార్థుల అంకితభావమే విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.తెలంగాణ విద్యార్థులు దేశ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారని ఎమ్మెల్యే పేర్కొంటూ, రుషి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Related Posts
ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు – తాసిల్దార్ వాణిరెడ్డి
- admin
- May 21, 2025
- 0
ఉప్పల్ న్యూస్ – ప్రభుత్వ స్థలాల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ తాసిల్దార్ వాణిరెడ్డి పేర్కొన్నారు,ఉప్పల్ తాసిల్దార్ వాణిరెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ ఆర్,ఐ సామ్సన్ పాల్,జూనియర్ అసిస్టెంట్ వెంకన్న,అలివేలు ఇతర అధికారులు […]
జాతీయస్థాయిలో ఉన్నత ప్రతిభను చాటిన అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు
- admin
- April 17, 2025
- 0
శ్రీ చైతన్య పాటశాలలో జాతియ స్థాయీలో నిర్వాహించిన INTSO లెవల్ 2 లో అత్తాపూర్ శాఖ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఈ సంధర్భంగా కలాశాల ప్రిన్సిపల్ వింద్య మాట్లాడుతు “జాతీయ స్థాయిలో జరిగిన […]
దివంగత జర్నలిస్ట్ సురేష్ కుటుంబానికి రాగిడి లక్ష్మారెడ్డి ఒక లక్ష ఆర్థిక సాయం
- admin
- June 25, 2025
- 0
ఉప్పల్ న్యూస్ – హఠాత్తుగా మరణించిన సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు సురేష్ సంస్మరణ సభలో ప్రకటించిన విధంగా రూ 1 లక్ష రూపాయల చెక్కును మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి […]
