ఉప్పల్, మే 19: తెలంగాణ ఎంసెట్-2026లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన చిలుకనగర్ డివిజన్కు చెందిన మల్లాడి రుషిని కేటీఆర్ ఘనంగా అభినందించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ నివాసం నానక్రామ్గూడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రుషికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఎంసెట్ పరీక్షల్లో 156.63 మార్కులు సాధించి రాష్ట్రంలో తొలి ర్యాంక్ సాధించిన రుషి, కొండల్ రెడ్డి కుమార్తె. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని కేటీఆర్ కొనియాడారు. రుషి విజయం చిలుకనగర్ డివిజన్తో పాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని రుషి నిరూపించిందని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరియు విద్యార్థుల అంకితభావమే విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.తెలంగాణ విద్యార్థులు దేశ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారని ఎమ్మెల్యే పేర్కొంటూ, రుషి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Related Posts
ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు – ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
- admin
- December 24, 2025
- 0
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు […]
శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం పునఃర్నిర్మాణానికి 2,50,000 విరాళం ఇచ్చిన మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు
- admin
- April 10, 2025
- 0
రామాంతపూర్ డివిజన్ న్యూ గొఖలే నగర్ శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ట రజతోత్సవ ఆహ్వాన కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు పాల్గొని ఆలయం పునర్నిర్మాణానికి 2,50,000 […]
డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు – కండ్లకోయలో నిర్వహణ
- admin
- April 11, 2026
- 0
మేడ్చల్,ఏప్రిల్11 :మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ నియంత్రణ మరియు నియంత్రణ పటిష్టత దినోత్సవం’ సందర్భంగా కండ్లకోయలోని సి.ఎం.ఆర్ ఫార్మసీ కళాశాలలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు, ర్యాలీ శనివారం నిర్వహించారు. […]
