ఉప్పల్, మే 19: తెలంగాణ ఎంసెట్-2026లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన చిలుకనగర్ డివిజన్కు చెందిన మల్లాడి రుషిని కేటీఆర్ ఘనంగా అభినందించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ నివాసం నానక్రామ్గూడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రుషికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఎంసెట్ పరీక్షల్లో 156.63 మార్కులు సాధించి రాష్ట్రంలో తొలి ర్యాంక్ సాధించిన రుషి, కొండల్ రెడ్డి కుమార్తె. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని కేటీఆర్ కొనియాడారు. రుషి విజయం చిలుకనగర్ డివిజన్తో పాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని రుషి నిరూపించిందని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరియు విద్యార్థుల అంకితభావమే విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.తెలంగాణ విద్యార్థులు దేశ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారని ఎమ్మెల్యే పేర్కొంటూ, రుషి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Related Posts
అఖిల భారత ఐటీ అసోసియేషన్స్ సమాఖ్య (FAIITA)బ్రాండ్ కోఆర్డినేషన్ కమిటీ (BCC) చైర్మన్గా దీపక్ బొమ్మిశెట్టి నియామకం
- admin
- April 14, 2025
- 0
ఆంధ్రప్రదేశ్ న్యూస్ – అఖిల భారత ఐటీ అసోసియేషన్స్ సమాఖ్య (FAIITA)బ్రాండ్ కోఆర్డినేషన్ కమిటీ (BCC) చైర్మన్గా దీపక్ బొమ్మిశెట్టి నియమించబడ్డారు, FAIITA ఏర్పాటైన 2013 సంవత్సరం నుండి స్థాపక సభ్యుడిగా ఉన్న బొమ్మిశెట్టి […]
ఉప్పల్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.1.86 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం – కార్పొరేటర్ రజితాపరమేశ్వర్రెడ్డి
- admin
- April 15, 2025
- 0
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టుగా ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజితాపరమేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. రూ.1.86 కోట్ల నిధులతో బైపాస్ […]
సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు సురేష్ గుండెపోటుతో మృతి
- admin
- May 31, 2025
- 0
ఉప్పల్, మే 31 సీనియర్ జర్నలిస్టు మాదిరాజు సురేష్ (52) శనివారం ఉదయం నివాసంలో పూజ చేస్తూ కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని టి ఎక్స్ హాస్పిటల్ కి తరలించగా అతనికి గుండెపోటు […]
